కబడ్డీ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:02 AM
మండలంలోని తొండపాడులో వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించారు.
గుత్తిరూరల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని తొండపాడులో వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో 54 టీములు పాల్గొన్నాయి. మొదటి బహుమతిగా రూ. 25 వేలు, రెండవ బహుమతిగా రూ. 15వేలు, మూడో బహుమతిగా రూ. 8 వేలు, నాల్గొ బహుమతిగా రూ. 5 వేలు ఇస్తామని కమిటీ నిర్వహకులు తెలిపారు. ఇందులో టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మిరంగయ్య, టీడీపీ నాయకులు చిన్నరెడ్డి యాదవ్, ఓంప్రకాష్, రామాంజునేయులు, ప్రకాష్ పాల్గొన్నారు.