granting పోస్టుల మంజూరుపై హర్షం
ABN , Publish Date - May 10 , 2025 | 12:31 AM
టీడీపీ ప్రభుత్వం కొత్తగా మున్సిప ల్ ఉన్నత పాఠశాలల్లో దాదాపు 1800 హెచఎం, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేయడంపై యూటీఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ధర్మవరం, మే 9(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం కొత్తగా మున్సిప ల్ ఉన్నత పాఠశాలల్లో దాదాపు 1800 హెచఎం, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేయడంపై యూటీఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో వారు కేక్కట్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శెట్టిపి జయచంద్రారెడ్డి, రామకృష్ణనాయక్, బిల్లే రామాంజినేయులు, ఆంజనయులు, లక్ష్మయ్య, అమర్నారాయణరెడ్డి, సాయిగణేశ, రామాంజినేయులు, ఆదిశేషు, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.