Share News

Inspection ఆర్టీసీ బస్టాండులో తనిఖీ

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:39 AM

స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌, డిపోనుఆర్టీసీ రీజనల్‌ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌ ఆదివారం తనిఖీ చేశారు.

Inspection  ఆర్టీసీ బస్టాండులో తనిఖీ
బస్టాండును తనిఖీ చేస్తున్న రీజనల్‌ చైర్మన పూల నాగరాజు

గుత్తి,జూన 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌, డిపోనుఆర్టీసీ రీజనల్‌ చైర్మన పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌ ఆదివారం తనిఖీ చేశారు. పామిడి మండలం కట్టకింద పల్లి గ్రామం నుంచి పామిడికి బస్సు సౌకర్యం కల్పించాలని, ఆ గ్రామం నుంచి 90 మందిపైగా విద్యార్థులు పామిడికి పాఠశాల, కళాశాలకు వెళ్తున్నారని వారిని గ్రామస్థులు కోరారు. వారి వెంట టీడీపీ నాయకులు నరేంద్రచౌదరి, సుధాకర్‌నాయుడు, పవనకుమార్‌ యాదవ్‌, బీజేపీ పట్టణ కన్వీనర్‌ బాలకృష్ణ ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:39 AM