Share News

తాగునీటి పంప్‌హౌస్‌ ప్రారంభం

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:46 PM

అ మృత పథకం కింద నిర్మించిన తాగునీటి పంప్‌హౌ్‌సను మున్సిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు

తాగునీటి పంప్‌హౌస్‌ ప్రారంభం
తాగునీటి సరఫరాను ప్రారంభిస్తున్న ప్రముఖులు

గుంతకల్లు, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అ మృత పథకం కింద నిర్మించిన తాగునీటి పంప్‌హౌ్‌సను మున్సిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు. పంపులను స్విచాన చేసిన వీరు తాగునీటి సరఫరాను ఆరంభించారు. భవాని మాట్లాడుతూ అమృత-1 ఫేజ్‌-2 కింద పట్టణంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరచేందుకు ఈ పంప్‌హౌస్‌ ఉపయోగపడుతుందన్నారు. గుమ్మనూరు నారాయణ స్వామి మాట్లాడుతూ... 2017లో అమృత పథకం కింద ఈ పనులను ప్రారంభించారని, కొన్ని కారణాలతో ఆ పనులు పూర్తికాలేదని, ప్రస్తుతం ప్రతిబంధకాలను అధిగమించి పూర్తి చేశామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నయ్యీం అహ్మద్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ ఆదినారాయణ, డీఈఈ కేతర్‌ కుమార్‌ రెడ్డి, మున్సిపల్‌ ఇంజనీరు ఇంతియాజ్‌ ఆలీ, టీడీపీ నాయకుడు తలారి మస్తానప్ప పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:46 PM