యాడికిని క్లీన అండ్ గ్రీనగా చేస్తా : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:15 PM
యాడికి గ్రామపంచాయతీని క్లీన అండ్ గ్రీనగా మారుస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు.
యాడికి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీని క్లీన అండ్ గ్రీనగా మారుస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. సోమవారం యాడికిలో ఎమ్మెల్యే సొంత నిధులతో పెద్దఎత్తున పరిశుభ్రత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 10 ఎక్స్కవేటర్లు, రెండు హిటాచీలు, 15 ట్రాక్టర్లు, 70 మంది పారిశుధ్య సిబ్బందితో పెద్దఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. అనంతరం స్థానిక ఆంజనేయస్వామికాలనీ తదితరచోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ పంపింగ్ మోటార్లను ప్రారంభించారు. ఇందులో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.