హుండీ ఆదాయం లెక్కింపు
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:28 PM
స్థానిక చింతల వెంకటరమణస్వామి ఆలయంలో స్వామివారికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించినట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు.
తాడిపత్రి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక చింతల వెంకటరమణస్వామి ఆలయంలో స్వామివారికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించినట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు. 2024 నవంబరు 28 నుంచి ఈ సెప్టెంబరు 11 వరకు రూ.8,75,824 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దామోదర్దాస్, చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.