ఘనంగా యల్లమ్మ రథోత్సవం
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:02 AM
మండలంలోని నాగేపల్లిలో యల్లమ్మ రథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కుందుర్పి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నాగేపల్లిలో యల్లమ్మ రథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు రథంపై అరటిపండ్లు వేసి మొక్కులు తీర్చుకున్నారు.