పరిహారం ఆలయ అభివృద్ధికి ఇవ్వండి
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:14 AM
రాయలచెరువు గ్రామంలోని చెరువులో ఏర్పాటు చేసిన హైటెన్షన టవర్ల ఏర్పాటుకు ఇచ్చే పరిహారాన్ని గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు తహసీల్దార్ ప్రతా్పరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
యాడికి, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): రాయలచెరువు గ్రామంలోని చెరువులో ఏర్పాటు చేసిన హైటెన్షన టవర్ల ఏర్పాటుకు ఇచ్చే పరిహారాన్ని గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్థులు తహసీల్దార్ ప్రతా్పరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టవర్ల ఏర్పాటు కోసం అందించే పరిహారాన్ని నిర్మాణంలో ఉన్న చెన్నకేశవస్వామి ఆలయానికి అందించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రామానాయుడు, శోభనబాబు, తలారి శివ, రాజశేఖర్, వెంకటనారాయణ, రవికిరణ్, రంగనాథ్చౌదరి ఉన్నారు.