organic fertilizersసేంద్రీయ ఎరువులకు డిమాండ్
ABN , Publish Date - May 01 , 2025 | 11:41 PM
సేంద్రీయ ఎరువులకు భారీ డిమాండ్ ఉంది. సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో డిమాండ్ మరీ ఎక్కువ. ఇక్కడ 30 కేజీల బస్తా ధర రూ. 50 ఉండగా .. కర్ణాటకలో రూ. 100 నుంచి రూ. 120 పలుకుతోంది.
గాండ్లపెంట, మే 1(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ ఎరువులకు భారీ డిమాండ్ ఉంది. సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో డిమాండ్ మరీ ఎక్కువ. ఇక్కడ 30 కేజీల బస్తా ధర రూ. 50 ఉండగా .. కర్ణాటకలో రూ. 100 నుంచి రూ. 120 పలుకుతోంది. దీంతో మండలంలో పలు గ్రామాల నుంచి సేంద్రీయ ఎరువులను కర్ణాటకకు తరలిస్తున్నారు. నిత్యం పందుల సంఖ్యలో లారీలు, ఐచర్ వాహనాల్లో తరలిస్తు న్నారు. గతంలో పులివెందలకు తరలించేవారు. అయితే ప్రస్తుతం కర్ణాటకలో వివిధ పండ్లమొక్కలు, ఉద్యాన వన పంటలకు సేంద్రీయ ఎరువులు అధికంగా వినియోగిస్తుండటంతో అక్కడ డిమాండ్ ఏర్పడింది. మన ప్రాంతంలోని సేంద్రీయ ఎరువులకు అధిక డిమాండ్ ఉండటంతో.. ఇక్కడి వారు అధిక ధరకు విక్రయిస్తున్నారు.