Share News

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:10 AM

నియోజకవర్గంలోని 30 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.89 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను విప్‌ కాలవ శ్రీనివాసులు తన స్వగృహంలో బాధితులకు గురువారం అందజేశారు

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత
చెక్కులను అందిస్తున్న విప్‌ కాలవ

రాయదుర్గంరూరల్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని 30 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.89 లక్షలు మంజూరైంది. అందుకు సంబంధించిన చెక్కులను విప్‌ కాలవ శ్రీనివాసులు తన స్వగృహంలో బాధితులకు గురువారం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలోని 210 మందికి రూ. 1.76 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైనట్లు విప్‌ తెలిపారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మండల కన్వీనర్‌ కురుబ హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:10 AM