Cheers కులగణన నిర్ణయంపై హర్షం
ABN , Publish Date - May 03 , 2025 | 12:33 AM
దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కదిరిఅర్బన, మే 2(ఆంధ్రజ్యోతి): దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు మాట్లాడుతూ.. ఈ కులగణన వల్ల అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, ఆచార్య, ఆదినారాయణ, శ్యామల, రామాంజి, సూరి పాల్గొన్నారు.