Share News

TDP టీడీపీ సభ్యత్వంతో భరోసా

ABN , Publish Date - May 07 , 2025 | 11:35 PM

మండలంలోని సీతారంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మారుతి ఈ ఏడాది జనవరి 11న రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

TDP టీడీపీ సభ్యత్వంతో భరోసా
మారుతి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిటాల శ్రీరామ్‌

ధర్మవరంరూరల్‌, మే7(ఆంధ్రజ్యోతి): మండలంలోని సీతారంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మారుతి ఈ ఏడాది జనవరి 11న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను టీడీపీ కార్యకర్తగా సభ్యత్వ నమోదు చేయించుకొని ఉండటంతో ఇన్సురెన్స ద్వారా రూ. ఐదు లక్షలు బాఽధిత కుటుంబానికి జమ అయింది. దీంతో బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీ రామ్‌ మండల నాయకులతో కలి సి ఆ గ్రామానికి వెళ్లి మారుతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుణుతూరు వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహే్‌షచౌదరి, మండలకన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న ఉన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:35 PM