strike notice ఆశాల సమ్మె నోటీసు
ABN , Publish Date - May 06 , 2025 | 11:53 PM
ఆశకార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నారు.

కదిరిఅర్బన, మే 6(ఆంధ్రజ్యోతి): ఆశకార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు మండలంలో పట్నం ఆ శా కార్యకర్తలు మంగళవారం పట్నం మెడికల్ అధికారి ప్రమీలకు సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. ఒప్పంద జీఓలను విడుదల చేయాలని, నియామకాలు ప్రభుత్వం చేపట్టాలని, చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని ఈ సమ్మె చేస్తున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ సాంబశివ, మస్తాక్, ఆశకార్యకర్తలు ఆంజనమ్మ, గంగులమ్మ, నాగలక్ష్మీ, రమాదేవి పాల్గొన్నారు.