housing plots పేదలందరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - May 05 , 2025 | 11:48 PM
జిల్లాలోని అర్హులందరికి ఇంటిస్థలాలు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గసభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు.
పుట్టపర్తి, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అర్హులందరికి ఇంటిస్థలాలు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గసభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లాలోని పేదలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ .... రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీని ఆలస్యం చేస్తే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ, రైతు,సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లిపెద్దన్న, నాయకులు నరసింహులు, దిల్షాద్, బాళ్ల అంజి, బాబావలి పాల్గొన్నారు.