scholarship 12మంది విద్యార్థులకు 100 శాతం స్కాలర్షిప్
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:57 PM
తాడిపత్రి ప్రాంతానికి చెందిన 12 మంది నిరుపేద విద్యార్థులకు అర్జాస్ స్టీల్ పరిశ్రమ వందశాతం స్కాలర్షిప్ అందిస్తున్నట్లు సీఈఓ పసుపులేటి ఆనంద్ తెలిపారు.
తాడిపత్రి, జూన 25(ఆంధ్రజ్యోతి): తాడిపత్రి ప్రాంతానికి చెందిన 12 మంది నిరుపేద విద్యార్థులకు అర్జాస్ స్టీల్ పరిశ్రమ వందశాతం స్కాలర్షిప్ అందిస్తున్నట్లు సీఈఓ పసుపులేటి ఆనంద్ తెలిపారు. బుధవారం పరిశ్రమ ఆవరణంలో ఆయన మాట్లాడుతూ.. ప్రవేశపరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. వీరు కర్ణాటకలోని సండూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల పాటు రెసిడెన్షియల్ విద్యను పొందుతారన్నారు. ఆ కళాశాలలో ప్రవేశపత్రాలను ఆ విద్యార్థులకు ఎంఈఓ నాగరాజు అందజేశారు. కార్యక్రమంలో ప్లాంట్ ఉద్యోగులు ఠాకూర్, నరేందర్, దేవరాజ్ పాల్గొన్నారు.