Share News

AP ECET: ఏపీఈసెట్‌కు 97శాతం హాజరు

ABN , Publish Date - May 07 , 2025 | 07:01 AM

ఏపీ ఈసెట్‌-2025కు 97.27% విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 1,272, ఏపీలో 32,956 మంది పరీక్షలు రాశారని ఏపీఈసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు తెలిపారు

AP ECET: ఏపీఈసెట్‌కు 97శాతం హాజరు

అనంతపురం సెంట్రల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2025కు 97.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 1,326 మందికి గాను 1,272 మంది, ఏపీలో 33,861 మందికిగాను 32,956 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఏపీఈసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు తెలిపారు. ప్రాథమిక కీ ఈ నెల 8న విడుదల చేస్తామని చెప్పారు.

Updated Date - May 07 , 2025 | 07:01 AM