Share News

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ అమలులో కృష్ణా జిల్లాకు 16వ స్థానం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:28 AM

‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం అమలులో కృష్ణాజిల్లాకు 16వ స్థానం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్‌శాఖ నిర్వహించిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు.

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ అమలులో కృష్ణా జిల్లాకు 16వ స్థానం

- ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు

మచిలీపట్నం, ఫిబ్రవరి14 (ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం అమలులో కృష్ణాజిల్లాకు 16వ స్థానం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్‌శాఖ నిర్వహించిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వ్యక్తిగత, పబ్లిక్‌ మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టి తదితర 14 అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. 200 పాయింట్లకు గాను జిల్లా 108 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచింది.

Updated Date - Feb 15 , 2025 | 12:28 AM