జీవవైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:48 PM
జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయ్యాలని రిటైర్డ్ బయాలజికల్ ప్రొఫెసర్ డాక్టర్ హిరోజీరావు బోంస్లే అన్నారు
- రిటైర్డ్ బయలాజికల్ ప్రొఫెసర్ డాక్టర్ హిరోజీరావు బోన్స్లే
మహబూబ్నగర్ విద్యావిభాగం, మార్చి 28 : జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయ్యాలని రిటైర్డ్ బయాలజికల్ ప్రొఫెసర్ డాక్టర్ హిరోజీరావు బోంస్లే అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళ డిగ్రీ కళాశాలలో బయోఫెస్ట్ కార్యశాల పోస్ట్ ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ‘జీవవైవిధ్య పరిరక్షణ మానవ జీ వితంపై ప్రభావం’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. బయోడైవర్శిటీని పరిరక్షించాల న్నారు. మానవులందరికి ఎంతో ముఖ్యమని, కాలుష్యాన్ని నివారించడానికి మనం తప్పనిసరిగా మొక్కలు పెంచాలన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, సురయ్యజబిన్, లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ సుధీర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.