వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - May 22 , 2024 | 11:10 PM
మండలంలోని దమగ్నాపూర్, నెల్లికొండి, వడ్డెమాన్ గ్రామా ల్లోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ రకాల మరమ్మతులను జిల్లా అడిషన ల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
- అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
చిన్నచింతకుంట, మే 22 : మండలంలోని దమగ్నాపూర్, నెల్లికొండి, వడ్డెమాన్ గ్రామా ల్లోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న వివిధ రకాల మరమ్మతులను జిల్లా అడిషన ల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. పోలింగ్ రిపేర్లు వారం రోజుల్లో పూర్తి చేయాలని, స్లాబులు తొలగించిన పాఠశాలల్లో పనులు మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. మండలంలోని మొత్తం 17 పాఠశాలలకు రూ.90 లక్షల నాలుగు వేలు అంచనా వ్యయం కాగా, ఇందులో రూ.22 లక్షల ఆరు వేల నిధులు మంజూరైనట్లు ఎంపీడీవో సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో లక్ష్మణ్సింగ్, ఎంపీవో అనిల్కుమార్, ఏపీఎంచారి, ఏపీవో నవీన్కుమార్, ఏఈ పీఆర్ కురుమూర్తి, మాజీ సర్పంచ్ హన్మంతురెడ్డి పాల్గొన్నారు.