Share News

ఇంకా ఉమ్మడి రాజధాని ఏమిటి?: కాంగ్రెస్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:42 AM

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా ఏపీకి రాజధాని లేక పోవడానికి ఏపీ సీఎం జగన్‌ పిచ్చి తుగ్లక్‌ వ్యవహారమే కారణమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ వ్యాఖ్యానించారు.

ఇంకా ఉమ్మడి రాజధాని ఏమిటి?: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతున్నా ఏపీకి రాజధాని లేక పోవడానికి ఏపీ సీఎం జగన్‌ పిచ్చి తుగ్లక్‌ వ్యవహారమే కారణమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలే లేనప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ మరో పదేళ్లు కొనసాగాలంటూ వైసీసీ నేత వైవీ సుబ్బారెడ్డి అనడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇరు ప్రాంతాల ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సుబ్బారెడ్డి ఈ ప్రకటన చేశారని విమర్శించారు.

Updated Date - Feb 15 , 2024 | 03:42 AM