‘నెల్లికల్లు’ త్వరితగతిన పూర్తిచేస్తాం : జైవీర్రెడ్డి
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:10 AM
నెల్లికల్లు ఎత్తిపోతల పథకా న్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్రెడ్డి అన్నారు.
![‘నెల్లికల్లు’ త్వరితగతిన పూర్తిచేస్తాం : జైవీర్రెడ్డి](https://media.andhrajyothy.com/media/2023/20231205/6nsp2_f_36fe8ca508.jpg)
‘నెల్లికల్లు’ త్వరితగతిన పూర్తిచేస్తాం : జైవీర్రెడ్డి
ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే సమీక్ష
నాగార్జునసాగర్, జనవరి 6: నెల్లికల్లు ఎత్తిపోతల పథకా న్ని త్వరితగతిన పూర్తి చేస్తామని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్రెడ్డి అన్నారు. సాగర్ హిల్కాలనీలో తన నివాసంలో శనివా రం రాత్రి ఆయన సాగర్ నీటి పారుదలశాఖ అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని సూచించిన ట్లు తెలిపారు. పనులు త్వరగా పూర్తికావడానికి అవసరమైన ని ధులు రానున్న బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. పదేళ్లుగా పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం పంపుహౌ జ్ల నిర్మాణ పనులు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. పనులను పూర్తి చేసి కృష్ణపట్టెలో బీడు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టును కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, సాగర్ ప్రాజెక్టు సీఈ అజయ్కుమార్, ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లిఖార్జున, డీఈలు సుదర్శన, శ్రీనివాస్, జేఈలు భిక్షమయ్య, కృష్ణయ్య, ఏఈలు సత్యనారాయణ, జనార్ధన, గోపినాథ్, కేశవ, కరుణాకర్ పాల్గొన్నారు.