Share News

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:34 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజి పేట మండలం మరికల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యు వకులు మృతి చెందారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

- తిమ్మాజిపేట మండలం మరికల్‌ వద్ద ఘటన

తిమ్మాజిపేట, జనవరి 28 : నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజి పేట మండలం మరికల్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యు వకులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం... ఆదివారం రాత్రి తిమ్మాజిపేట మండలంలోని మ రికల్‌ గ్రామ సమీపంలోని స్వాగతం కమాన్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లికి చెందిన హర్షవర్ధన్‌గౌడ్‌ (20), చంద్రశేఖర్‌ అలియాస్‌ చందుగౌడ్‌ (23)లు ఓ వ్యక్తిని మ రికల్‌ గ్రామంలో దింపడానికి బైక్‌పై వచ్చి తిరిగి వెళ్తుండగా గ్రా మ సమీపాన ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని జడ్చర్లలోని ఓ ప్రైవే ట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. తిమ్మాజిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచ నామా నిర్వహించారు.

Updated Date - Jan 28 , 2024 | 11:34 PM