Share News

నేడు రాహుల్‌..ఎల్లుండి ప్రియాంక ప్రచారం

ABN , Publish Date - May 09 , 2024 | 05:26 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నర్సాపూర్‌లో, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని

నేడు రాహుల్‌..ఎల్లుండి ప్రియాంక ప్రచారం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గురువారం మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నర్సాపూర్‌లో, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్లో సాయంత్రం 4 గంటల వరకు నర్సాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు సరూర్‌నగర్‌కు వెళ్తారు. సరూర్‌నగర్‌ సభ ముగియగానే ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. కాగా, శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. భువనగిరి నియోజకవర్గంలోని నకిరేకల్‌లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. 11న(శనివారం) ప్రియాంక కామారెడ్డిలో జరిగే రోడ్‌షోలోను, తాండూరు సభలోనూ పాల్గొంటారు.

Updated Date - May 09 , 2024 | 08:14 AM