Share News

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:17 AM

వేర్వేరు కారణాలతో నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

ఆలేరు రూరల్‌, శాలిగౌరారం, జనవరి 4: వేర్వేరు కారణాలతో నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. యాదా ద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపా గ్రామానికి చెందిన గంధమల్ల శ్రీను (26) కొద్ది నెలలుగా మానసిక ఆంధోళనతో బాధపడుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనును చికిత్స నిమిత్తం ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలేరు ఎస్‌ఐ వెంకట శ్రీను తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత

ఆలేరు మండలకేంద్రంలోని రెడ్డిగూడెంకాలనీలో అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతిచెందింది. మోటకొండూరు మండలం మాటూరు గ్రామానికి చెందిన మచ్చ కావ్య(22)కు యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన మచ్చ శ్రీనివాస్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వారు ఆలేరులోని రెడ్డిగూ డెంలో నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం కావ్య ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే ఉన్న భర్త శ్రీనివాస్‌ గుర్తించి చుట్టుపక్కల వారి సాయంతో చికిత్స కోసం ఆలేరులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కావ్య తండ్రి దరిగె శంకరయ్య ఆరో పించారు. ఆయన ఫిర్యాదు మేరకు కావ్య భర్త శ్రీనివాస్‌తో పాటు మరో నలు గురిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెంకట శ్రీను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అమ్మ తిట్టిందని..

వ్యసనాలు మానుకోవాలని తల్లి మందలించడంతో మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొ ండారం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ ఉప్పల సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాచర్ల ఆండాళ్‌ కుమారుడు శ్రీకాంత్‌(27) కొన్నేళ్లుగా గ్రామపంచాయతీలో మల్టీప ర్పస్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి చిన్ననాడే మృతిచెందగా, తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌ మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం తాగి జల్సాగా తిరుగుతున్నాడు. తాగి తిరి గితే బాగుండదని, పెళ్లి చేయాలంటే పిల్లను ఎవరు ఇస్తారని తల్లి మంద లించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్‌ బుధవారం సాయంత్రం గ్రామ పంచాయతీ మోటారు పెట్టి వస్తానని వెళ్లి అక్కడే పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీకాంత్‌ను అక్కడున్న కొందరు గమనించి తల్లికి సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లి ఆండాళ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణపాయ స్థితిలో ఉన్న శ్రీకాంత్‌ను నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. తల్లి ఆండాళ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 12:17 AM