కేసీఆర్ రోడ్షోలో దొంగల చేతివాటం
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:57 AM
మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆ ర్ చేపట్టిన రోడ్షోలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
కేసీఆర్ రోడ్షోలో దొంగల చేతివాటం
మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పర్సు తస్కరణ
తిప్పర్తి, ఏప్రిల్ 21: మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆ ర్ చేపట్టిన రోడ్షోలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. కేసీఆర్ మిర్యాలగూడెం నుంచి సూర్యాపేటకు వెళ్తూ తిప్పర్తి మండల కేంద్రంలో 15 ని మిషాల పాటు ఆగారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పర్సు, తిప్పర్తి గ్రా మానికి చెందిన జాకటి డానియల్, ఏశబోయిన మల్లేష్ మెడలోని తు లంన్నర బంగారు చైన్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వీరితో పాటు రామలింగాలగూడెం గ్రామానికి చెందిన వనపర్తి నాగేశ్వర్రావుకు చెందిన రూ. 15 వేల నగదును దోచేశారు. జాకటి డానియల్ అనే వ్యక్తి తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.