నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:36 PM
నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు.
నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయం
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి
నల్లగొండ, ఏ ప్రిల్ 26: నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పలువురు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ప్రజలు, రైతులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఐదు నెలలలోనే అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఇంతవరకు రైతుబంఽధు వేయలేదని, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం ప్ర భుత్వం ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని మభ్య పెడుతుందని వి మర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలుకావడం లేదని విమర్శించారు. నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెంది న రాజుతో పాటు పలువురు టీఆర్ఎ్సలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, నాయకులు భిక్షం, శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.