Share News

మలేరియా నివారణే లక్ష్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:27 PM

2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్‌ పట్టణంలో డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

మలేరియా నివారణే లక్ష్యం

డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25 : 2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్‌ పట్టణంలో డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కొన్ని సంవత్సరాలుగా ప్రజలలో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరిగిందన్నారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పడడంతో మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:27 PM