మలేరియా నివారణే లక్ష్యం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:27 PM
2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్ పట్టణంలో డీఎంహెచ్వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
డీఎంహెచ్వో పాల్వన్కుమార్
వికారాబాద్, ఏప్రిల్ 25 : 2030 నాటికి మలేరియాను నివారణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా గురువారం వికారాబాద్ పట్టణంలో డీఎంహెచ్వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కొన్ని సంవత్సరాలుగా ప్రజలలో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరిగిందన్నారు. గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పడడంతో మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.