గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:05 AM
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
నల్లగొండ టౌన, ఫిబ్రవరి 27: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. టూటౌన ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తుతెలియని మహిళ ఆదివారం సాయంత్రం ఆ స్పత్రి ఆవరణలో మృతిచెందింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు స మాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికం గా భిక్షాటన చేస్తూ ఉండేదని స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీలో భ ద్రపర్చినట్లు ఎస్ఐ తెలిపారు. వివరాలు తెలిస్తే సెల్: 8712670176 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.