Share News

అధికారులు సమస్యలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:25 PM

ప్ర త్యేక అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ అన్నారు.

 అధికారులు సమస్యలపై దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రాజమణి

అధికారులు సమస్యలపై దృష్టి సారించాలి

ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ

మర్రిగూడ, జూన 10: ప్ర త్యేక అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎంపీపీ గండికోట రాజమణిహరికృష్ణ అన్నారు. మండల పరిషత కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచులు లే నందున ప్రత్యేక అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అధికారులు ప్ర జలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీడీవో మున్నయ్య అధ్యక్షతన వహించిన ఈ సమావేశం లో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:25 PM