Share News

లేబర్‌కు ధీమా

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:26 AM

భనవ, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కు ప్రభుత్వం అందిస్తున్న లేబర్‌ గుర్తింపు కార్డులు కుటుంబాల్లో ధీమాను కల్పిస్తున్నాయి. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అ పథకాన్ని అమలుచేస్తోంది. 18 నుంచి 60ఏళ్ల వయస్సు కలిగిన భవన నిర్మాణ కార్మికులు అర్హు లవుతారు.

లేబర్‌కు ధీమా
లేబర్‌ కార్డులు

కార్మికులకు అండగా లేబర్‌ కార్డులు

జిల్లాలో 82,540 మంది పేరు నమోదు

ప్రమాద మరణానికి రూ.6.30 లక్షల పరిహారం

సాధారణ మరణానికి రూ.1.30 లక్షలు

ఇప్పటివరకు 2,802 కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం

బచ్చన్నపేట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భనవ, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కు ప్రభుత్వం అందిస్తున్న లేబర్‌ గుర్తింపు కార్డులు కుటుంబాల్లో ధీమాను కల్పిస్తున్నాయి. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అ పథకాన్ని అమలుచేస్తోంది. 18 నుంచి 60ఏళ్ల వయస్సు కలిగిన భవన నిర్మాణ కార్మికులు అర్హు లవుతారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు జనగామ కార్మిక కార్యాలయంలో 82,540 మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదయ్యారు. ఇందులో పురు షులు 43,036, మహిళలు 39,504 మంది ఉన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కార్డులు కార్మికులకు తప్పని సరి. తాపిమేస్త్రీలు, వండ్రంగి, వెల్డిం గ్‌, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, టైల్స్‌, వడ్డెర లు, ఇతర నిర్మాణాలలో పనిచేసే కార్మికులకు లేబర్‌ కార్డులను కార్మిక శాఖ ద్వారా జారీ చేస్తున్నారు. 1996 లో చట్టం అమల్లోకి రాగా, ఇప్పటి వరకు జనగామ జిల్లాలో సహాజ మరణం పొందిన 756 మంది కార్మి కుల కుటుంబాలకు రూ.1.30 లక్షల చొప్పుల లబ్ధి చేకూ రింది. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని కుమార్తె ల వివాహాలకు 995 మందికి రూ.30వేల చొప్పున సంక్షే మ మండలి ద్వారా లబ్ధి పొందారు. ప్రసూతి సహాయం కింద 1 021 మందికి, ప్రమాదం, అనారోగ్యం బారిన పడి తాత్కాలిక చికిత్సకు 11మందికి రూ.13,500 చొప్పు న అందించారు. ప్రమాదవశాత్తు మరణించిన 19మంది కార్మిక కుటుంబాలకు రూ. 6.30లక్షల చొప్పున అందిం చారు. అర్హులైన ప్రతీ కార్మికు డు తప్పకుండా లేబర్‌ కార్డు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కార్డుఉంటే ధీమా ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ప్రయోజనాలు అనేకం..

లేబర్‌కార్డులున్న వారి పిల్లల వివాహ కానుకగా రూ. 30 వేలు, ప్రసవం కింద రూ. 30వేలు అందిస్తారు. కార్మికుడికి ఇద్దరు కుమార్తెలుంటే ఒక్కొక్కరికి రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. సాధారణ మరణంకు రూ. 1.30 లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 6.30 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం వల్ల అంగవైకల్యం కలిగితే దాని ఆధారంగగా పరిహారం అందజేస్తారు.

నమోదు చేసుకోవటం ఇలా..

లేబర్‌ కార్డు పొందాలనుకునే వారు కార్మికులు పనిచేసే ఫొటో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా బుక్‌, ఫోన్‌ నంబరు, కుటుంబ సభ్యులు, చేసే పని వివరాలకు సంబంధించిన ఫారాన్ని నింపి మీసేవలో దరఖాస్తు చేయాలి. ఆధార్‌నమోదు తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకుడికి రూ.110 చెల్లించాలి. దరఖాస్తు ఫారాలను జిల్లా కార్మికశాఖ కార్యాలయంలో అందజేస్తే, వాటిని పరిశీలలించి అర్హుడిగా తేలితే కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులు ఐదేళ్ల వరకు పనిచేస్తుంది. నిర్ణీత సమయంలో రెన్యూవల్‌ చేయించుకోవాలి ఉంటుంది. లేకుంటే సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది.

అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి

- కుమారస్వామి, జిల్లా సహాయ కార్మిక అధికారి

భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికులు తప్పని సరిగా లేబర్‌ కార్డులకకు దరఖాస్తులు చేసుకోవాలి. కార్మికునితో పాటు కుటుంబ సభ్యులకు సైతం ప్రయోజ నం చేకూరుతుంది. కొంత మంది కార్మికులు రెన్యూవల్‌ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నట్టు మా దృష్టికి వచ్చింది, వారు ఖచ్చితంగా నిబంధనల మేరకు పత్రాలు సమర్పించి రెన్యూవల్‌ చేసుకోవాలి.

Updated Date - Oct 25 , 2024 | 12:26 AM