ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:29 AM
ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది సిరిసిల్లకు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ(66) అనే చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని రాజీవ్నగర్కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని భీవండి వస్త్ర
![ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య](https://media.andhrajyothy.com/media/2024/20240326/9narayana_5e898e4dee.jpg)
బాధిత కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
రూ.50 వేలు సాయం అందజేత
సిరిసిల్ల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది సిరిసిల్లకు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ(66) అనే చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్లలోని రాజీవ్నగర్కు చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని భీవండి వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలపై పని చేసినప్పుడు కాలికి గాయమైంది. దీంతో సిరిసిల్లకు వచ్చి మరమగ్గాలు నడుపుతున్నాడు. అతని భార్య వజ్రవ్వ నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురైంది. లక్ష్మీనారాయణ దంపతుల వైద్యం ఖర్చులు నెలకు రూ.10 వేల వరకు అవుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి లేక మరోపక్క అప్పు దొరక్క మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ తరఫున రూ.50 వేలు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.