Share News

విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:45 AM

వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్‌ జ యశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జమునారాణి, ప్రాంతీయ వ్య వసాయ పరిశోధన పాలెం డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లారెడి అన్నారు.

 విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
కళాశాల మ్యాగజైనను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు

విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి

కళాశాల మ్యాగజైనను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు

త్రిపురారం, ఏప్రిల్‌ 17: వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్‌ జ యశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జమునారాణి, ప్రాంతీయ వ్య వసాయ పరిశోధన పాలెం డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లారెడి అన్నారు. త్రిపురారం మండలంలోని కంపాసాగర్‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల 8వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర కిరణాలు-2024 పేరుతో కళాశాల మ్యాగజైనను వారు ఆవిష్కరించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విదార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయ విద్యలో రా ణించి క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేకూర్చాలని సూచించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:45 AM