విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:45 AM
వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్ జ యశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ జమునారాణి, ప్రాంతీయ వ్య వసాయ పరిశోధన పాలెం డైరెక్టర్ డాక్టర్ మల్లారెడి అన్నారు.
విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
కళాశాల మ్యాగజైనను ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలు
త్రిపురారం, ఏప్రిల్ 17: వృత్తి విద్యా కోర్సులు చేసే విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రొఫెసర్ జ యశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పాలిటెక్నిక్ డైరెక్టర్ డాక్టర్ జమునారాణి, ప్రాంతీయ వ్య వసాయ పరిశోధన పాలెం డైరెక్టర్ డాక్టర్ మల్లారెడి అన్నారు. త్రిపురారం మండలంలోని కంపాసాగర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల 8వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర కిరణాలు-2024 పేరుతో కళాశాల మ్యాగజైనను వారు ఆవిష్కరించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విదార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు వ్యవసాయ విద్యలో రా ణించి క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేకూర్చాలని సూచించారు.