Share News

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతికి ఎస్సై ప్రేమ వల

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:56 AM

స్టేషనుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ఎస్సైని సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతికి ఎస్సై ప్రేమ వల

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం

ఆపై మరో యువతితో నిశ్చితార్ధం

బాధితురాలి ఫిర్యాదుతుతో నిందితుడిని అరెస్ట్‌ చేసిన సైదాబాద్‌ పోలీసులు

సైదాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): స్టేషనుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ ఎస్సైని సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్ల్లాకు చెందిన ఓ గిరిజన యువతి నగరంలో జూనియర్‌ ఆర్టి్‌స్టగా పనిచేస్తూ సైదాబాద్‌ పీఎస్‌ పరిధిలోని తన అత్త వాళ్ల వద్ద ఉంటోంది. గతేడాది జనవరిలో అత్త, మామల మఽధ్య జరిగిన గొడవ కారణంగా ఫిర్యాదు చేసేందుకు సైదాబద్‌ పీఎ్‌సకు వెళ్లింది. ఆ సమయంలో ట్రైనీ ఎస్సైగా ఉన్న నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్‌(29).. క్రమంగా ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఫోన్‌ నంబరు తీసుకొని తరచూ ఫోన్‌లో, వాట్సా్‌పలో టచ్‌లో ఉండేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆరునెలల క్రితం సదరు యువతి అరుణ్‌ ఫోన్‌లో అతడికి మరో అమ్మాయితో నిశ్చితార్థం అయిన ఫొటోలను చూసి నిలదీసింది. ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటానని అరుణ్‌ నమ్మబలికాడు. ఆ తర్వాత నెలల గడుస్తున్నా అరుణ్‌ పెళ్లి ప్రస్తావన వాయిదా వేస్తుండడంతో యువతి అరుణ్‌ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి సోదరుడికి ఫోన్‌ చేసి తమ సంబంధం గురించి చెప్పింది. ఈ క్రమంలో అరుణ్‌ యువతికి ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో బాధితురాలు సైదాబద్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 19 , 2024 | 02:59 AM