పూర్వ విద్యార్థులకు.. 3, 8 ర్యాంకులు: శ్రీ గౌతమ్ విద్యాసంస్థలు
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:55 AM
జేఈఈ ఫలితాల్లో తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారని డాక్టర్ కేకేఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జేఈఈ ఫలితాల్లో తమ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారని డాక్టర్ కేకేఆర్ గౌతం విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తోటంశెట్టి నిఖిలేశ్ 3వ ర్యాంకు, అరిపికట్ల తేజస్వీ 8వ ర్యాంకు, పి.విద్యప్రవీణ్ 14వ ర్యాంకు, సతివాడ జ్యోతిరాదిత్య 17వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. 100 లోపు 17 ర్యాంకులను తమ పూర్వ విద్యార్థులు కైవసం చేసుకున్నారన్నారు. విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాసంస్థ తరఫున అభినందనలు తెలిపారు.