ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య టాప్!
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:47 AM
ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు 26 మంది 468 మార్కులు సాధించారని, అలాగే 422 మంది 467 ఆపైగా, 1,100 మంది 466
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు 26 మంది 468 మార్కులు సాధించారని, అలాగే 422 మంది 467 ఆపైగా, 1,100 మంది 466 ఆపైగా, 3,822 మంది 460పైగా మార్కులు పొందారని తెలిపారు. జూనియర్ బైపీసీలో 440 మార్కులకు 19 మంది 438 మార్కులు పొందారని, అదేవిధంగా 162 మందికి 437 ఆపైన, 404 మందికి 436కు పైగా, 631 మందికి 435, 1,524 మందికి 430 మార్కులు వచ్చాయని ఆమె వెల్లడించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 5 మంది 1000 మార్కులకు 993 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారని తెలిపారు. బైపీసీలో 994 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంతో పాటు 83 మంది 990 ఆపై మార్కులు సాధించారని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పటిష్ఠమైన ప్రోగ్రామ్, సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి ఆధ్యాపకుల శిక్షణలో ఈ విధమైన ఫలితాలను సాధిస్తున్నట్టు సుష్మ తెలిపారు.