మోదీ సభకు స్థల పరిశీలన
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:31 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న ప్రధాని నరేంద్రమోదీ వికారాబాద్ రానున్నారు. ఇందుకు సంబంధించిన బహిరంగ సభ నిర్వహణకు స్థల పరిశీలన చేస్తున్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 25 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న ప్రధాని నరేంద్రమోదీ వికారాబాద్ రానున్నారు. ఇందుకు సంబంధించిన బహిరంగ సభ నిర్వహణకు స్థల పరిశీలన చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఎస్పీ కోటిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు వికారాబాద్ మునిసిపల్ పరిధి మద్గుల్ చిట్టంపల్లి సమీపంలోని ప్రజా రిసార్ట్స్లోని ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. 100 ఎకరాలున్న ఈ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆప్రదేశాన్ని ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్చించారు.