శాస్త్రోక్తంగా నాగవల్లీ దళార్చనలు
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:13 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామికి మంగళవారం నిత్య విధి కైంకర్యాలు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లీ దళా ర్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
![శాస్త్రోక్తంగా నాగవల్లీ దళార్చనలు](https://media.andhrajyothy.com/media/2024/20240227/02nlg27_84e479fe7c.jpg)
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామికి మంగళవారం నిత్య విధి కైంకర్యాలు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లీ దళా ర్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువు లను సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, నిత్యార్చనలు చేపట్టి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరు కల్యాణోత్సవాలు నిర్వహించారు. కొండపైన విష్ణు పుష్క రిణి, ప్రధానాలయం, అనుబంధ పాతగుట్ట, శివాలయంల్లో కొలువైన ఆంజనేయస్వామిని అర్చకస్వాములు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం నిర్వహించారు. శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్పటిక మూర్తులకు నిత్య పూజలు, నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.25,10,779 ఆదాయం సమకూరింది.