Share News

Kumaram Bheem Asifabad- స్కూల్‌ బస్సు, లారీ ఢీ

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:30 PM

రెబ్బెన మండలం ఇందిరానగర్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం స్కూల్‌బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

Kumaram Bheem Asifabad-    స్కూల్‌ బస్సు, లారీ ఢీ
దెబ్బతిన్న బస్సు, లారీ

రెబ్బెన, జనవరి 9: రెబ్బెన మండలం ఇందిరానగర్‌ సమీపంలో మంగళవారం సాయంత్రం స్కూల్‌బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రంలోని అన్నపూర్ణ హై స్కూలుకు చెందిన బస్సులో సాయంత్రం డ్రైవర్‌ సుధాకర్‌ పిల్లలను తీసుకొని కొండపల్లికి బయలు దేరారు. ఈ క్రమంలో ఇందిరానగర్‌ వద్ద స్కూల్‌ పిల్లలను దించిన డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో కొండపల్లికి వెళు తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగాయి. బస్సులో ఉన్న విద్యార్థులు ధనుష్‌, అశ్విత్‌, దేవిక శ్రీ, అభినవ్‌, విజయలక్ష్మి, వరుణ్‌ చంద్ర, రాంచరణ్‌, అక్షిత, ఆదిత్య, రవిచంద్ర, శ్రావ్య, వర్షిత్‌, నిఖిల్‌, తదితరులు గాయపడ్డారు. విద్యార్థులను కాగజ్‌నగర్‌ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. బస్సును అజాగ్రతగా, అతి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - Jan 09 , 2024 | 10:30 PM