Share News

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:11 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు బస్సులను పెంచినట్లు TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీంతోపాటు ఆర్టీసీ నిన్న ఒక్కరోజు 52 లక్షల మందికిపైగా ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసినట్లు తెలిపింది.

Sajjanar: సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ప్రయాణికులు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది వారి వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజుల పండుగ తర్వాత తిరిగి వారి ప్రాంతాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఒక్క రోజే తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 52.78 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిందని టీఆర్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు.

ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1861 ప్రత్యేక బస్సులను నడిపామని తెలిపారు. ఈ సంక్రాంతి సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, గత మూడు రోజుల్లోనే 4,400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామని సజ్జనార్ వివరించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ponnam Prabhakar: బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు: పొన్నం ప్రభాకర్

సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్సులను పెంచగా మరికొన్ని రోజుల్లో ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఈ రాకపోకల సంఖ్య మరింత పెరగనుంది. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసు స్కీంను అమలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 06:17 PM