Share News

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:28 AM

తాను ప్రాణాపాయంలో ఉండి బస్సులో ఉ న్న ప్రయాణిలను సురక్షితంగా ఉంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అసువులు బా సిన సంఘటన జాతీయరహదారిపై భీమవరం వద్ద శనివారం జరిగింది.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

వత్సవాయి, మార్చి 23: తాను ప్రాణాపాయంలో ఉండి బస్సులో ఉ న్న ప్రయాణిలను సురక్షితంగా ఉంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అసువులు బా సిన సంఘటన జాతీయరహదారిపై భీమవరం వద్ద శనివారం జరిగింది. మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ భద్రయ్య (55) విజయవాడ నుంచి తి రిగి మిర్యాలగూడకు వెళ్తూ భీమవరం వద్ద గుండెపోటు వచ్చింది. దీంతో బస్సును పక్కన నిలిపాడు. జీఎంఆర్‌ టోల్‌ప్లాజా సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేసి జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్రైవర్‌ ముందుగా గమనించకుంటే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. డ్రైవర్‌ భద్రయ్యకు ప్ర యాణికులు అశ్రునయనాలతో నివాళులర్పించి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 12:28 AM