ముందుగా గృహ ప్రవేశం చేసివారికి రూ.లక్ష
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:24 AM
ముందుగా గృహ ప్రవేశం చేసే లబ్ధిదారులకు రూ.లక్ష బహుమతిగా అందజేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
![ముందుగా గృహ ప్రవేశం చేసివారికి రూ.లక్ష](https://media.andhrajyothy.com/media/2024/20240306/11alr_rural_4_1925fecb9d.jpg)
ఆలేరు రూరల్, మార్చి 11: ముందుగా గృహ ప్రవేశం చేసే లబ్ధిదారులకు రూ.లక్ష బహుమతిగా అందజేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని గొల నుకొండలో 179మంది లబ్ధిదారులకు సోమవారం నివేశ స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ది ప్రజల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం బడుగు బల హీన వర్గాల అభివృద్ధి సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. ప్రతిపక్షాల అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దన్నారు. రైతులు, ప్రజలు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ముందుగా గృహ ప్రవేశం చేసే లబ్ధిదారులకు రూ.లక్ష బహుమతిగా అందజేస్తామన్నారు. భక్తుల కొంగు బంగారం అయిన లక్ష్మీనరసింహ స్వామి అంద రిని గౌరవించే దైవమని బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని గొలనుకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయిగిరి గుట్టకు సీఎం రేవంత్రెడ్డి దంపతులు రావడం శుభపరిణామమన్నారు. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని గంటన్నర పాటు కలియ దిరుగుతూ భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న నాయకుడు సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గత పాలకులు బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని ప్రజలు అనేక సందర్భాలలో నిలదీశా రన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, ఎంపీటీసీ దాసి లక్ష్మీ, వైస్ఎంపీపీ గాజుల లావణ్య, హరిబాబు, వెంకటేష్, సురేష్, నీలం పద్మ ఉన్నారు.