Share News

Manchiryāla- పునరావాసకాలనీ పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:23 PM

దుబ్బగూడెం పునరావాకాలనీలో చేపట్టే పనులు వేగవంతం చేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నా రు. సోమవారం ఆయన దుబ్బగూడెం పునరావాసకాలనీ పనులను పరిశీలించారు.

Manchiryāla-    పునరావాసకాలనీ పనులు వేగవంతం చేయాలి
విలేకరులతో మాట్లాడుతున్న కోదండరాం

కాసిపేట, మార్చి 18: దుబ్బగూడెం పునరావాకాలనీలో చేపట్టే పనులు వేగవంతం చేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నా రు. సోమవారం ఆయన దుబ్బగూడెం పునరావాసకాలనీ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణిఖని మెగా ఓసీపీలో భూములు, ఇళ్లు కోల్పో యిన దుబ్బగూడెం నిర్వాసితులకు నష్టపరిహారం అప్పుడు తక్కువగా చెల్లించారని చెప్పారు. కానీ పునరావాస నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నార న్నారు. ఓసీపీలో పేల్చే బత్తి దెబ్బలకు ఇళ్లు బీటలు వారుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆరు ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. దుబ్బగూడెం వాసులు భయంతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వెంటనే పునరావాస కాలనీ పనులను పూర్తి చేయాల న్నారు. నిర్వాసిత గ్రామంలోని యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించా లన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్‌అండ్‌ఆర్‌ పాలసీని సమర్ధవంతంగా అమలు చేసి భూ నిర్వాసితులను అదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీజెఎస్‌ రాష్ట్ర ఆర్గనైజిం గ్‌ కార్యదర్శి బాబన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్‌, మంచిర్యాల పట్టణా ధ్యక్షుడు సిరాజ్‌, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 10:23 PM