పీవోడబ్ల్యూ సంధ్య జీవన సహచరుడు రామకృష్ణారెడ్డి కన్నుమూత
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:44 AM
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య జీవిత భాగస్వామి, కవి, నవ్య ప్రింటింగ్ ప్రెస్ సంస్థ యజమాని రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా ‘
![పీవోడబ్ల్యూ సంధ్య జీవన సహచరుడు రామకృష్ణారెడ్డి కన్నుమూత](https://media.andhrajyothy.com/media/2024/20240215/2_RKR_03_dda4e84d77.jpg)
రాంనగర్/హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య జీవిత భాగస్వామి, కవి, నవ్య ప్రింటింగ్ ప్రెస్ సంస్థ యజమాని రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా ‘మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్’తో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే రామకృష్ణారెడ్డి మృతిచెందినట్లు తెలిపారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు చిట్యాల సమీపంలోని నేరడలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తారు. విప్లవ సాహిత్యాన్ని ముద్రిస్తున్నారనే కారణంతో రెండేళ్ల క్రితం నవ్య ప్రింటింగ్ ప్రెస్పై పోలీసులు దాడి చేసి సీజ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. విద్యార్థి దశలో పీడీఎ్సయూలో చురుకుగా పాల్గొన్న రామకృష్ణారెడ్డి అదే సంఘంలో పనిచేస్తున్న ఉద్యమ సహచరురాలు సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రైతు నేస్తం వెంకటేశ్వర్లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, కవులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు రామకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.