Share News

ఖమ్మంలో రఘురాంరెడ్డి నామినేషన్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:09 AM

అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోయినా ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి

ఖమ్మంలో రఘురాంరెడ్డి నామినేషన్‌

కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించకుండానే నామినేషన్‌ వేసిన పొంగులేటి వియ్యంకుడు

ఖమ్మం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోయినా ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశా రు. మంగళవారం ఆయన తరఫున మద్దతుదార్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీవీ గౌతమ్‌కు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వాటిలో ఆయనను కాంగ్రెస్‌ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. అయితే టికెట్‌ ఆశిస్తున్న వారు తమ పేరుమీద మంచిరోజు ఉందని నామినేషన్లు వేస్తున్నారు. పార్టీ ఆదేశాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని, మంచిరోజు కావడం వల్ల ముందుగానే రఘురాంరెడ్డి నామినేషన్‌ వేసినట్లు పొంగులేటి వర్గీయులు పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 05:10 AM