క్వింటా పసుపు రూ.15,025
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:26 AM
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం బద్దం సంతోష్ అనే రైతు అనే రైతు తీసుకొచ్చిన పసుపు రికార్డు స్థాయిలో
![క్వింటా పసుపు రూ.15,025](https://media.andhrajyothy.com/media/2024/20240229/9_Nzb_7d466b0fa0.jpg)
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రికార్డుస్థాయి ధర
ఖిల్లా (నిజామాబాద్), ఫిబ్రవరి 29: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం బద్దం సంతోష్ అనే రైతు అనే రైతు తీసుకొచ్చిన పసుపు రికార్డు స్థాయిలో క్వింటా రూ.15,025లు పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర. అయితే సంతోష్ క్వింటాలున్నర పసుపు తీసుకురాగా దానికి మాత్రమే ఈ ధర లభించింది. మిగిలిన రైతుల పసుపు క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,500 మధ్య ధర పలికింది. కొంతమందికి రూ.14,611 వరకు ధర పలికింది. కాగా, గురువారం మార్కెట్కు మొత్తం 7,500 క్వింటాళ్ల పసుపు అమ్మకానికి వచ్చింది. మార్కెట్లో సరాసరి మోడల్ రేటు ప్రకారం ధర వస్తుందని కార్యదర్శి వెంకటేశం తెలిపారు.