Kumaram Bheem Asifabad- పూలాజీబాబా బోధనలు ఆచరించాలి
ABN , Publish Date - Mar 09 , 2024 | 10:44 PM
పూలాజీబాబా బోధనలు ఆచరించాలలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని పట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్లో శనివారం నిర్వహంచిన మహా శివరాత్రి ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడారు.
జైనూర్, మార్చి 9: పూలాజీబాబా బోధనలు ఆచరించాలలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని పట్నాపూర్ సిద్దేశ్వర్ సంస్థాన్లో శనివారం నిర్వహంచిన మహా శివరాత్రి ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూలాజీబాబా జన్మదిన వేడుకలను అధికారికంగా నిర్వహించిందని చెప్పారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో నడువాలని చెప్పారు. ఆనంతరం పూలాజీబాబా తనయుడు ఇంగ్లే కేశవ్రావ్ మాట్లాడుతూ మొదట పట్నాపూర్లో ఒకే ఒక ధ్యాన మందిరం ఉండేదని న్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 200 ధ్యాన మందిరాలు నెల కొల్పామని వివరించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావ్ ఇంగ్లే, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.