బహ్రెయిన్ వేదికగా పొంగులేటి వారి పెళ్లి సందడి
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:56 AM
గల్ఫ్లోని బహ్రెయిన్ వేదికగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి కుమారుడైన లోహిత్రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. బీఆర్ఎస్
![బహ్రెయిన్ వేదికగా పొంగులేటి వారి పెళ్లి సందడి](https://media.andhrajyothy.com/media/2023/20231205/MMN_0ae80c12ae.jpg)
14న మంత్రి పొంగులేటి సోదరుడి కుమారుడి వివాహం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
గల్ఫ్లోని బహ్రెయిన్ వేదికగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి కుమారుడైన లోహిత్రెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి సోదరుడు మహేందర్రెడ్డి కుమార్తెను లోహిత్రెడ్డి పెళ్లి చేసుకోనున్నారు. బుధవారం(ఈ నెల 14 ) రోజున వివాహ ముహూర్తం నిర్ణయించగా, ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ అయిన రాజ్పుష్ప.. వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందినది కాగా, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ నిర్మాణ రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి శ్రీనివా్సరెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బంధుగణసమేతంగా ఇప్పటికే బహ్రెయిన్ చేరుకున్నారు. వివాహ కార్యక్రమాల్లో వీరంతా బిజీబిజీగా ఉన్నారు. కాగా, ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులు మంగళ, బుధవారాల్లో బహ్రెయిన్ రానున్నట్లు తెలిసింది.