Share News

Kumaram Bheem Asifabad- సర్దార్‌బస్తీలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:41 PM

కాగజ్‌నగర్‌ సర్దార్‌బస్తీలో బుధవారం డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన కూడా సమాచారం అందించాలన్నారు.

Kumaram Bheem Asifabad-    సర్దార్‌బస్తీలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ కరుణాకర్‌

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 3: కాగజ్‌నగర్‌ సర్దార్‌బస్తీలో బుధవారం డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన కూడా సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ లేని వాహనాలను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐ శంకరయ్య, ఎస్సైలు అంజయ్య, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

నజ్రూల్‌నగర్‌లో ఫ్లాగ్‌మార్చ్‌

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 3: కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో ఫ్లాగ్‌మార్చ్‌ కార్యక్రమాన్ని బుధవారం డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బలగాలతో ప్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అంతా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ రాంబాబు, ఈసుగాం ఎస్సై రామన్‌కుమార్‌, సీఆర్‌పీఎప్‌ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:41 PM