పీజీ హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:25 PM
పీజీ హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని పీయూజేఏసీ చైర్మన్ బత్తిని రాము డిమాండ్ చేశారు.
![పీజీ హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- పీయూజేఏసీ చైర్మన్ బత్తిని రాము
- పీజీ కళాశాల ముందు విద్యార్థుల నిరసన
కొల్లాపూర్, మార్చి 12 : పీజీ హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని పీయూజేఏసీ చైర్మన్ బత్తిని రాము డిమాండ్ చేశారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాల విద్యార్థులతో కలిసి మంగళవారం నిరసన తెలి పారు. ఈ సందర్భంగా పీయూజేఏసీ చైర్మన్ బత్తిని రాము, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు డి.శేఖర్, స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా నాయకులు దాసు మాట్లాడుతూ పీజీ కళాశాల ప్రారంభం నుంచి ఈనాటి వరకు హాస్టల్ వసతు లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారని, విద్యార్థులు దూరప్రాంతాల నుంచి ఇక్క డికి వచ్చి అడ్మిషన్ పొంది ఉన్నత విద్యతో కూడిన పట్టాలు తీసుకోవాలని ఎన్నో ఆశలతో విద్యార్థులు వస్తే హాస్టల్ వసతి లేక ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. రాష్ట్రంలో క్రియాశీలక మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న వారు స్పందించి తక్షణమే విద్యార్థులకు పీజీ హాస్టల్, మెస్ను ప్రారంభిం చాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, స్వేరో స్టూడెంట్ యూనియన్ నాయ కులు, విద్యార్థులు పాల్గొన్నారు.