ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి : టీడీపీ
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:11 AM
ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతుందని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు వేదికగా ప్రజలు ఓడించి ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ అన్నారు.
ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి : టీడీపీ
మునుగోడు, ఏప్రిల్ 24: ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతుందని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు వేదికగా ప్రజలు ఓడించి ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ అన్నారు. మునుగోడులో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని బీఆర్ఎ్సకు పదేళ్లు అధికారం కట్టబెట్టినా కేసీఆర్ నియంత పాలనతో వనరులను దోచుకొని కుటంబం అభివృద్ధి చెందిందే తప్ప ప్రజలు కాదని విమర్శించారు. ఎ న్నికల్లో ఇచ్చిన హామీలను ఏళ్లుగా అమలుచేయటంలో కాలయాపన చేసి ఓటమి పా లైన బీఆర్ఎస్ నేతలకు అధికారంలో కోల్పోవటంతో జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలలకే హామీలు అమ లు చేయటం లేదని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా విమర్శ లు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు అప్పారావు, లింగ య్య, సైదులు, లక్ష్మీనారాయణ, సత్తయ్య, యాదయ్య, నర్సింహ, శ్రీశైలం పాల్గొన్నారు.